ఆంధ్రప్రదేశ్‌

సమస్యల పరిష్కారానికి వైకాపా రాజీలేని పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, నవంబర్ 29: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెదిరే ప్రశే్నలేదన్నారు. కడప జిల్లా పులివెందుల, సింహాద్రిపురం, వేంపల్లెలో జగన్ మంగళవారం పర్యటించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తూ దోపిడీకి పాల్పడుతోందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, నదుల అనుసంధానం పేరిట కోట్లాది రూపాయలు కొల్లగొడుతోందన్నారు. రానున్నది మన ప్రభుత్వమేనని, ఏ కార్యకర్త, నాయకుడు అధైర్యపడకుండా తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని ఎదుర్కొని పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. వైకాపా ఆధ్వర్యంలో ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు ఇదే నిదర్శనమన్నారు. ఆయన వెంట కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కడప జిల్లా పులివెందులలో పార్టీ నాయకులతో మాట్లాడుతున్న జగన్