ఆంధ్రప్రదేశ్‌

నోట్లకోసం తోపులాట.. పగిలిన బ్యాంక్ అద్దాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, డిసెంబర్ 3: కొత్త నోట్లు, చిల్లరకోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బ్యాంకులు, ఎటిఎంలలో నగదు నిల్వలు శనివారం నుంచి లేవు. జిల్లాకు శుక్రవారం 109 కోట్ల రూపాయల మేర నగదు రావడంతో శనివారం బ్యాంకుల నిండా జనమే. ఈ సందర్భంగా పట్టణంలోని సన్నిధివీధిలో ఉన్న భారతీయ స్టేట్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద తోపులాట జరిగింది. దీంతో బ్యాంక్ ద్వారం అద్దాలు పగిలిపోయాయి. గంటల తరబడి క్యూలో ఉన్నా నగదు అందకపోవడంతో క్యూలో నిల్చున్న వారి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బ్యాంక్ అద్దాలు పగిలిపోయాయి. అలాగే పలుచోట్ల బ్యాంకుల వద్ద కూడా తోపులాటలు జరిగాయి. ఎటిఎం సెంటర్ల వద్ద కూడా జనం బారులు తీరారు. చాలినంత కరెన్సీ అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోస్తున్నారు