ఆంధ్రప్రదేశ్
జయ మృతితో బాబు దిగ్భ్రాంతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 7 December 2016
విజయవాడ, డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అకాల మరణం తనకొక షాక్ లాంటిదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జయలలిత మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి కలగాలని రాష్ట్ర సచివాలయం సంతాపం తెలిపింది. సంతాప సూచకంగా ఉద్యోగులు రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు.. జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయ జీవితంలో అనేక పోరాటాలు చేశారని, అన్ని పోరాటాల్లో విజయం సాధించారని, 75 రోజులపాటు మృత్యువుతో పోరాడారని, ఆమె మృతి చెందడం చాలా బాధగా వుందని అన్నారు.