ఆంధ్రప్రదేశ్‌

ఇబ్బందులు తాత్కాలికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 12: పెద్దనోట్ల రద్దును ప్రజలు హర్షిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని, గతంలో నల్లధనంపై నానాయాగీ చేసిన ప్రతిపక్షాలు నేడు నోరుమెదపడం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకే పెద్దనోట్లను రద్దు చేశారన్నారు. దీనివల్ల ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ నెలాఖరు నాటికి సాధారణ స్థితి నెలకొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు కొంత మందగించినప్పటికీ రానున్నకాలంలో మరింతగా పుంజుకుంటుందన్నారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చటంలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర ఉందని, ఇప్పటికే 26 మంది అధికారులపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపట్టిందన్నారు. గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీరేట్లతో రుణాలిస్తే వృద్ధిరేటు మరింత పెరిగే అవకాశముందన్నారు. పెద్దనోట్లు 14 లక్షల కోట్లకు పైగా ఉండగా ఇప్పటికే 11.58 లక్షల కోట్లు ఆర్‌బిఐ వద్దకు చేరాయన్నారు. గత రెండేళ్లుగా నల్లధనంపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు నేడు పార్లమెంట్‌లో ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. నగదు రహిత లావాదేవీలు జరపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి ప్యాకేజీలో ఉన్న అన్ని ప్రాజెక్టులు వస్తాయన్నారు. కేంద్రం బంగారంపై అమలు చేస్తున్న నిబంధనలు కొత్తవేమీ కావన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో ప్రభుత్వం సొమ్ము జమచేస్తుందనేవి కేవలం వదంతులే అన్నారు.