ఆంధ్రప్రదేశ్‌

ప్రతి రూపాయికీ లెక్క చూపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో సింగపూర్ తరహా విధానాన్ని అనుసరిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సొంత ఆర్థిక వనరులతో పాటు బయటి దేశాల్లో పెట్టుబడులు పెట్టి సింగపూర్ ఆదాయ మార్గాలను పెంచుకుంటోందని ఆయన తెలిపారు. బలమున్న రంగాల్లో బయటి రాష్ట్రాలకు సేవలందించడం ద్వారా ఆదాయం పెంచుకునేందుకున్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఆఖరి మైలురాయి వరకు అందే ప్రతి రూపాయి కూడా లెక్కల్లో కనిపించాలని చంద్రబాబు ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఆర్థిక వ్యవహారాలన్నీ ఇప్పటికే డిజిటలైజ్ చేశామని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లామ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఆర్థిక వ్యవహారాలన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామని, ఎక్కడా మానవ సహిత లావాదేవీలు లేవని చెప్పారు. అయితే ట్రెజరీ, బ్యాంకులు, ఆర్‌బిఐ మధ్య సరైన అనుసంధానం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అక్టోబర్ మాసంతో పోల్చితే నవంబరులో రాష్ట్ర సొంత వనరుల ఆదాయం రూ.200 కోట్లు తగ్గిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఈ సంవత్సరం ఇప్పటివరకు వున్న అన్ని బిల్లులను క్లియర్ చేశామని ముఖ్యమంత్రికి తెలిపారు. నీరు-చెట్టు వంటి కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ యేతర కేటాయింపులకు సంబంధించిన బిల్లుల్ని క్లియర్ చేయాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన నిధుల్లో రూ.వెయ్యి కోట్లు నాబార్డు నుంచి త్వరలో అందనున్నాయని, అవి వస్తే కొంత ఆర్థిక వెసులుబాటు వుంటుందని అధికారులు వివరించారు. మున్సిపల్, ఆర్ అండ్ బి, జలవనరుల శాఖలకు సంబంధించి బడ్జెట్ యేతర ఖర్చుకు సంబంధించిన రూ.1400 కోట్లు సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. నిధుల వినియోగంలో ప్రభుత్వ శాఖల మధ్య కనె్వర్జెన్సీ వుండేలా చూడాలని కోరారు. ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల గురించి సమావేశంలో సమీక్షించారు. కొత్తగా అభివృద్ధి చేసిన సిఎఫ్‌ఎంఎస్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి కొన్ని వివరాలు అందించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఐటి కార్యదర్శి విజయానంద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.