ఆంధ్రప్రదేశ్‌

బాలికపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, డిసెంబర్ 15: బాలిక(14)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో గురువారం వెలుగుచూసింది. బాధితురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని సంగయ్యపేటకు చెందిన బాలిక(14) స్థానిక బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాల వదిలిన తరువాత ఇంటివద్ద ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి నీ స్నేహితురాలు పిలుస్తోందని చెప్పి ఆటోలో తీసుకువెళ్లారు. బాలికను బిజినవేముల గ్రామం సమీపంలోని కెసికాలువ వద్ద ఉన్న ఓ ఇంటికి తీసుకువెళ్లి కాళ్లూచేతులు కట్టివేసి రాత్రంతా అత్యాచారం జరిపారు. గురువారం తెల్లవారుజామున బాలికను ఆటోలో తీసుకువచ్చి నందికొట్కూరు నుంచి పగిడ్యాల గ్రామం వెళ్లే దారిలో ఉన్న గాయత్రీ ఆలయం వద్ద వదిలేశారు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపుతామని వారు బెదించారు. ఉదయం అక్కడికి చేరుకున్న స్థానికులు బాలికను గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఇంటికి తీసుకువచ్చారు. అయితే జరిగిన విషయాన్ని బాలిక ఎవరికీ చెప్పలేదు. బాలిక ఒంటిపై గాట్లు, చిన్న చిన్న గాయాలను గమనించిన తల్లిదండ్రులు, బంధువులు నిలదీయగా జరిగిన సంగతి ఏకరువు పెట్టింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సిఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మినారాయణ బాలికను విచారించారు. ముగ్గురు మాట్లాడుకుంటుండగా మున్నా అన్న పేరు వినిపించిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.