ఆంధ్రప్రదేశ్
రాయి గట్టిదనం అదుర్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పోలవరం, డిసెంబర్ 15: దేశంలో ఏ ప్రాజెక్టు ప్రాంతంలో లేనంత గట్టిదనం కలిగివున్న రాయి పోలవరం స్పిల్వే నిర్మాణ ప్రాంతంలో ఉందని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) జియాలజిస్టు జిజెఎస్ ప్రసాద్ తెలిపారు. గురువారం స్పిల్వే నిర్మాణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ స్పిల్వే నిర్మాణ ప్రాంతంలో ఉన్న రాయి 90 శాతం గట్టితనం కలిగివుందని పరీక్షల్లో వెల్లడైందన్నారు. గత పది రోజులుగా స్పిల్వే ప్రాంతంలో ఉన్న రాయిని బర్మాబులిటీ టెస్టు, పెట్లోడ్ టెస్టులు చేయించారని తెలిపారు. ఆ నివేదికలను విశే్లషించిన తర్వాత స్పిల్వే నిర్మాణ ప్రాంతంలో కాంక్రీటు పనులకు అనుమతిస్తామన్నారు.
స్పిల్వే నిర్మాణ ప్రాంతంలో 30 ఇంటూ 20 మీటర్ల పరిధిలో రాయి టెస్టులు పూర్తిచేశామని, ఆ పరిధిలోని కాంక్రీటు పనులకు అనుమతులు ఇస్తామన్నారు. ఆ తర్వాత మరో బ్లాక్ పరిధిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం కాంక్రీటు పనులకు అనుమతులిస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట ప్రాజెక్టు డిఇలు కె శ్రీనివాసు, కె బాలకృష్ణ, వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజన్సీ జిఎం సత్యనారాయణ ఉన్నారు.
చిత్రం..స్పిల్వే నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జియాలజిస్టు ప్రసాద్