ఆంధ్రప్రదేశ్‌

సన్నిధానం అతిథిగృహంలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 15: తిరుమల సన్నిధానం అతిథిగృహంలో గురువారం చోరీ జరిగింది. భక్తులకు చెందిన 2.30 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని సన్నిధానం అతిథిగృహంలో 30వ నెంబర్ గదిలో బస చేశారు. గురువారం ఉదయం గదికి తాళం వేసి టిఫిన్ చేయడానికి వెళ్లారు. తిరిగి వారు గది వద్దకు రాగా గది తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించారు. లోపలకు వెళ్లి చూడగా దొంగలు సూట్‌కేసును పగులగొట్టి అందులోని రూ.2.30 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే బాధితులు క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గదిలో నిందితుల వేలిముద్రలు సేకరించారు. ఈ సంఘటనను సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.