ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఎన్నికల్లో మోదీ చెల్లని నోటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 16: వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ చెల్లనినోటుగా మిగిలిపోతారని సిపిఐ జాతీయ కార్యదర్శి పి నారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా 120 మంది సామాన్యులు మృతిచెందారని ఇవన్నీ మోదీ చేసిన హత్యలుగానే భావించాల్సి ఉందన్నారు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ప్రధానమంత్రిపై హత్యానేరం మోపాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయం ముందుగానే కొందరు మోదీ సన్నిహితులకు తెలుసని ఆరోపించారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అవినీతి కుంభకోణాల చరిత్ర దేశానికి తెలుసన్నారు. మోదీకి మతిస్థిమితంలేక ప్రజలపై సర్జికల్ దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో పెట్టుబడిదారీ, కార్పొరేట్ శక్తులకే లబ్ది చేకూరిందని విమర్శించారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ చర్యలతో అద్వానీ వంటి సీనియర్ నేతలే తలలు పట్టుకుంటున్నారన్నారు. ఆయనకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని స్పష్టం చేశారు. సినిమాహాళ్లలో జాతీయగీతాన్ని ఆలపించాలనే నిబంధనపై నారాయణ స్పందిస్తూ ఇది పబ్బుల్లో జానపద నృత్యం లాంటిదే అని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ దాడులను ప్రోత్సహించేందుకే దేశభక్తి అంటూ పిచ్చి నిబంధనలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీన్ని ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ భక్తిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అయినప్పటికీ దానికీ ఓ పద్ధతి ఉంటుందని దీనిపై సుప్రీం కోర్టుకు లేఖ రాశానని పేర్కొన్నారు.