ఆంధ్రప్రదేశ్‌

58 లక్షలకు టిడిపి సభ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: 2014-16లో ఎపిలో 46,72,124 మంది టిడిపి సభ్యత్వం తీసుకున్నారు. 2016-18కి గాను ఇప్పటికే 58,75,005 మంది సభ్యులుగా చేరారు. అంటే 12,02,781 సభ్యత్వం పెరిగింది. పెద్ద నోట్ల రద్దుతో నగదు సమస్య ఉన్నప్పటికీ సభ్యత్వం గణనీయంగా పెరగడం ఒక రికార్డని ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు చెప్పారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, 1300 కుటుంబాలకు ప్రమాద బీమా 24 కోట్లు అందించటం జరిగిందన్నారు. మరో 3,400 మంది కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్య, వ్యాపారాల నిమిత్తం సాయం అందించామని, ఈ విధంగా దేశంలో మరే పార్టీ చేయలేదని స్పష్టం చేశారు. పార్టీ యంత్రాంగాన్ని ఉత్సాహపరిచి నడిపించడంలోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంలోనూ లోకేష్ చేసిన ప్రత్యేక కృషి సభ్యత్వం పెరుగుదలకు దోహదపడిందన్నారు. ఈ విజయంలో పాలుపంచుకున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులందరికీ అభినందనలు చెప్పారు.