ఆంధ్రప్రదేశ్‌

ఎసిబికి చిక్కిన చిరుద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, డిసెంబర్ 16: చేసిన పనికి బిల్లులు తయారు చేయాలని కూలీలు కోరగా 20వేల రూపాయల లంచం ఇస్తే చేసిపెడతానని చెప్పడంతో బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బిరుదులనరవ గ్రామానికి చెందిన బి చిన్నసామేలు, ఎ పెద్దనాగయ్య అదేగ్రామంలోని నీటి యాజమాన్య సంస్థలో సుమారు లక్షా 85వేల రూపాయలకు పైపులు వేసే పనిచేశారు. దీనితో వారు మార్కాపురం నీటి యాజమాన్య సంస్థలో టెక్నికల్ అసిస్టెంటుగా పని చేస్తున్న జి త్రిపురారెడ్డిని బిల్లులు చేయాలని కోరగా 20వేల రూపాయలు చెల్లిస్తే బిల్లులు తయారు చేస్తానని చెప్పడంతో ఈనెల 13న బాధితులు ఒంగోలులోని ఎసిబి అధికారులను ఆశ్రయించారు. కాగా శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో పథకం ప్రకారం త్రిపురారెడ్డికి డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హేండెడ్‌గా పట్టుకున్నారు.