ఆంధ్రప్రదేశ్‌

సమష్టి కృషితో సాధిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 18: సమిష్టి కృషితో రిజర్వేషన్లు సాధించుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపులకు పిలుపునిచ్చారు. కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుచేయాలని డిమాండ్‌చేశారు. కాపు జెఎసి రాష్టవ్య్రాప్త పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆదివారం జరిగిన ‘కాపుల ఆకలి కేకలు’ నిరసన కార్యక్రమంలో ముద్రగడ పాల్గొన్నారు. నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని కంచాలతో, గరిటెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినిపించేలా కాపుల ఆకలి కేకల నిరసన కార్యక్రమం ఉండాలన్నారు. చప్పుడు చేసి వెళ్లిపోయేవారిలా కాపులు ఉండకూడదని, హక్కుల సాధన కోసం ఎంత త్యాగానికైనా తెగించే జాతి కాపుజాతి అని ఆయన పేర్కొన్నారు. నిరసన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో గాంధేయ మార్గంలో ఉండాలన్నారు. రిజర్వేషన్లు రావడం వల్ల కాపుల పిల్లలకు మంచి భవిష్యత్తు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు చినమిల్లి వెంకట్రాయుడు, ఆకుల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఈతకోట తాతాజీ, మాకా శ్రీనివాస్, గుండుబోగుల రాము, నరిశే సోమేశ్వరరావు, వలవల బాబ్జీ, యెగ్గిన నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..‘కాపుల ఆకలి కేకలు’ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ