ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రులను అవమానించిన బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: జై ఆంధ్ర ఉద్యమంలో 400 మందికి పైగా యువకులు ఆత్మార్పణం చేశారని, దీనిని మనం ఎప్పుడూ మరవలేమని జన సేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఆంధ్రులను బిజెపి అవమానపరిచిందని ఆయన పేర్కొన్నారు. బిజెపి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, 400 మంది త్యాగాలను మర్చిపోకుండా ఎలా ఉండగలమని ఆయన అన్నారు.
బిజెపిని ఈ విషయమై నిలదీయాలని, బిజెపి ఆంధ్రకు హోదా విషయంలో ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం బాధ కలిగించే అంశమని ఆయన అన్నారు. ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీ కూడా కంటితుడుపుగా మారిందన్నారు. ప్రత్యేకం అనే పదం తప్ప ఈ ప్యాకేజీలో ప్రత్యేకత ఏముందన్నారు. ఆంధ్ర ప్రజలను బిజెపి వెన్నుముక లేనివారిగా ఆత్మగౌరవం లేని వారిగా భావిస్తుందా అని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్న బిజెపి ఆ తర్వాత మాట మార్చారన్నారు. దశాబ్ధ కాలం పాటు ఆంధ్రులను అవమానించి, రాజధాని లేకుండా, ఎక్కువ రెవెన్యూ లోటుతో తోసేశారన్నారు. మొదటి ప్రత్యేక కేటగిరీ అన్నారు. ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారని ఆయన ట్వీట్ చేశారు.