ఆంధ్రప్రదేశ్‌

ఉనికి కోసమే జగన్ ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 27: పులివెందులకు నీటి కోసం 80 శాతం నిధులు వైఎస్ ఖర్చు చేశారని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటని, ప్రజలు 38 ఏళ్లు పొలాలు ఎండబెట్టుకుంటే 80 శాతం ఖర్చు పెట్టామని జగన్ చెప్పుకుంటుంటే పూర్తిగా నీరు తీసుకురావడానికి ఇంకెన్ని దశాబ్దాలు ఎదురు చూడాలోనని పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మల్లెల లింగారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు కృషితో పులివెందులకు సాగునీరు రానుందని అర్ధమై ప్రతిపక్ష నాయకుడు ఉలిక్కిపడుతున్నాడన్నారు. పులివెందుల పొలాలకు వచ్చే నీళ్లు వైఎస్ కుటుంబ దౌర్జన్యాల కింద నీళ్లుగా పారనున్నాయని జగన్‌కు దడపట్టుకుందన్నారు. జగన్ ధర్నాలు ఆయన తండ్రి అసమర్ధతను చాటుతున్నాయని, గత మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం గుప్పిట్లోనే పులివెందుల నియోజకవర్గం ఉందని గుర్తు చేశారు. వైఎస్ కుటుంబం పులివెందుల ప్రజలకు పట్టిన పీడగా భావిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.