ఆంధ్రప్రదేశ్‌

దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, డిసెంబర్ 29: దేశంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి మోసం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నవంబర్ 8వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లు రద్దు చేయడం ద్వారా నల్లకుబేరులను బయటకు ఈడ్చుతామని చెప్పారని, అయితే ఇందులో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. అంతేకాక నోట్ల రద్దు వల్ల దేశంలో నకిలీ కరెన్సీని కట్టడి చేయవచ్చని చెప్పినా సాధ్యం కాలేదన్నారు. ఇప్పటికే చాలాచోట్ల రూ.2 వేల నకిలీ నోట్లతో వ్యాపారులు నష్టపోతున్నారన్నారు. అంతేకాక అవినీతి మరింత పెరిగిందని ఆరోపించారు. పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరం అని ప్రధాని ప్రకటించడం తగదన్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం 50 రోజుల తర్వాత సామాన్యుల ఇబ్బందులు ఉండవని ప్రకటించారని, అయితే ప్రజల కష్టాలు మరింత పెరిగాయన్నారు. డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం వల్ల ప్రజలకు మరింత నష్టం జరుగుతుందన్నారు. నగదు రహిత లావాదేవీల వల్ల ప్రజలకు లాభం లేదని, దీనివల్ల విదేశీ సంస్థలు, ప్రైవేటుసంస్థలకు లాభమన్నారు. కమీషన్ల కోసం ప్రధాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని అంటున్నారని, ఇది ఏమాత్రం సాధ్యం కాదన్నారు.