ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమిలో దళిత సర్పంచ్ ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 2: ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారంటూ ఆవేదనతో అధికార పార్టీకే చెందిన ఓ దళిత సర్పంచ్ జన్మభూమి గ్రామసభ సాక్షిగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండల నూతిమడుగు గ్రామంలో సోమవారం జరిగిన జన్మభూమి-మా వూరు గ్రామసభలో ఈ ఘటన చోటుచేసుకుంది. నూతిమడుగులో సోమవారం అధికారులు జన్మభూమి సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సాకే నర్సింహులును వేదికపైకి ఆహ్వానించలేదు. అయితే టిడిపి మండల కన్వీనర్ నర్సింహులు అధ్యక్షతన సభ ప్రారంభమైంది. అధికార పార్టీకి చెందిన మండల నాయకుడికే అధికారులు ప్రాధాన్యం ఇవ్వడాన్ని సర్పంచ్ నర్సింహులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో తీవ్రమనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు.