ఆంధ్రప్రదేశ్‌

507.70 అడుగులకు సాగర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, ఏప్రిల్ 4: శ్రీశైలం జలాశయం నుండి నీటి చేరిక తగ్గుతుండటంతో సోమవారం సాయంత్రానికి నాగార్జున సాగర్ నీటిమట్టం 507.70 అడుగులకు చేరుకుంది. ఇది 127.7989 టిఎంసిలకు సమానం. సాగార్జున సాగర్ జలాశయం నుండి ఎడమ కాలువ ద్వారా 5064 క్యూసెక్కులు, మంచినీటి అవసరాల కోసం హైదరాబాద్ జంట నగరాలకు 808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్‌ఫ్లోగా 5872 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి 2013 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 800 అడుగుల వద్ద నిలకడగా ఉంది.