ఆంధ్రప్రదేశ్‌

నోరు తెరిస్తే అబద్ధాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలుగోడు, జనవరి 7: రాష్ట్రంలో అబద్ధాల ప్రభుత్వం నడుస్తోందని వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న రైతు భరోసాయాత్రలో భాగంగా వెలుగోడు మండలంలో శనివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించకున్నారని, అధికారంలోకి రాగానే తూతూమంత్రంగా విదిల్చారన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన డబ్బు బ్యాంకు వడ్డీలకే సరిపోలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని మరో అబద్దం చెప్పి నిరుద్యోగ యువకులకు ఆశ చూపించారని, ఉపాథి హామీ పనికి గాను జాబుకార్డులిచ్చారన్నారు, నిరుద్యోగభృతి ఇస్తామని ఆశచూపి ఓట్లు వేయించుకుని వారికీ మొండిచేయి చూపించారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు సైతం మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు చేయలేదన్నారు. సినిమా క్లైమాక్స్‌కు వచ్చింది, చంద్రబాబునాయుడు చెప్పిన అబద్దాలకు ఫలితం అనుభవిస్తారన్నారు. బాబు చెప్పిన అబద్దాలకు, చేసిన మోసాలకు ప్రజలు బుద్ధిచెప్పే రోజు ఎంతో దగ్గరలో ఉందన్నారు.

చిత్రం..కర్నూలు జిల్లా వెలుగోడులో జరిగిన రోడ్‌షోలో ప్రసంగిస్తున్న జగన్