ఆంధ్రప్రదేశ్‌

అధికారమిస్తే రాజన్న పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జనవరి 9: వైకాపా అధికారంలోకి వస్తే రాజన్న పాలన చూప్తారని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రైతు భరోసాయాత్రలో భాగంగా సోమవారం బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో జగన్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారితో జగన్ మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచే పార్టీ వైకాపా అన్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేసి సాగునీరందిస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఓంకార క్షేత్రంలో పూజలు చేసిన జగన్ వెంగళరెడ్డిపేటలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పొలాల్లో రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం మహానంది మండలం పుట్టుపల్లె, అల్లీనగరం, తిమ్మాపురం గ్రామాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించారు.

చిత్రం..రోడ్ షోలో వృద్దుడిని పరామర్శిస్తున్న జగన్