ఆంధ్రప్రదేశ్‌

స్క్వాడ్ టిటిఇపై ప్రయాణికుని దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 12: విధి నిర్వహణలో ఉన్న విజయవాడ డివిజన్ స్క్వాడ్ టిటిఇ ప్రతిభా భారతిపై ఓ ప్రయాణికుడు దాడి చేసి గాయపరచిన సంఘటన జరిగింది. వివరాల ప్రకారం ప్రతిభా భారతి స్క్వాడ్ టిటిఇగా విధులు నిర్వహిస్తోంది. ఎప్పటిలాగానే మంగళవారం టికెట్లు తనిఖీ చేసుకుంటూ కొరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై నుండి విజయవాడ వస్తుండగా ఈ సంఘటన జరిగింది. చెన్నై స్టేషన్ దాటాక ఎస్ 3 కోచ్‌లో టికెట్ తనిఖీ చేస్తుండగా సుమన్ భోయి అనే ప్రయాణికుడిని టికెట్ చూపించమని కోరగా అతను నువ్వు టికెట్ ఎగ్జామినర్ వేనా గుర్తింపు కార్డు చూపించమంటూ ఎదురు ప్రశ్నలు వేస్తూ సిబ్బందికి ససకరిచకుండా ఘర్షణకు దిగాడు. గుర్తింపుకార్డు చూపించినా కూడా ననే్న టికెట్ అడుగుతావా అంటూ ఆమెపై ఘర్షణకు దిగి కుడి చెయ్యి మెలిపెట్టి దాడికి దిగాడు. దీంతో ఆమెకు కుడి అరచేయ్యిలో వాపు వచ్చి నరాలు దెబ్బతిన్నాయి. రైలు గూడూరు స్టేషన్‌లో ఆగినప్పుడు గూడూరు ఆర్‌పిఎఫ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.