ఆంధ్రప్రదేశ్‌

శరవేగంగా అసెంబ్లీ భవన నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: వెలగపూడి సచివాలయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవన నిర్మాణాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు వేగంగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 28 నాటికి భవన నిర్మాణం పూర్తి అవుతుందని, 29న ప్రభుత్వానికి కాంట్రాక్టరు అప్పగిస్తారని తెలిపారు. స్పీకర్‌తో ఈ భవనాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు వెలగపూడిలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.

చిత్రం..శాసనసభభవన నిర్మాణ పనులు పరిశీలిస్తున్న మంత్రి నారాయణ