ఆంధ్రప్రదేశ్‌

25 నుంచి సత్యాగ్రహ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 22: కాపుల రిజర్వేషన్ల కోసం తాను తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీ నుంచి సత్యాగ్రహ పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుండి ప్రారంభిస్తానని చెప్పారు. కాకినాడ నగరంలోని కాపు జెఎసినేత వాసిరెడ్డి ఏసుదాసు నివాసంలో ఆదివారం ముద్రగడ విలేఖరులతో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరుతానని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. గతంలో టిడిపి అధినేత చంద్రబాబు పాదయాత్రలు చేసిన సమయంలో రోడ్లు సరిగా లేనిచోట మార్గాలను కూడా నిర్మించుకున్నారని ఆరోపించారు.