ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం అక్రమరవాణా సూత్రధారి బాబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 24: చంద్రబాబు నాయుడు సిఎం అయ్యాకే శేషాచలం కొండల్లోని విలువైన ఎర్రచందనం అక్రమంగా తరలిపోతోందని, దీని వెనుక సిఎం హస్తముందుని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమరవాణాను ఉక్కుపాదంతో అణచివేస్తామని, స్మగ్లర్ల అంతు చూస్తానని బాబు బీరాలు పలికారని అన్నారు. అయితే స్మగ్లర్లను కాపాడేలా వ్యవహరిస్తూ , తనవారి చేత స్మగ్లింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఎర్రచందనం అక్రమరవాణా చేస్తు పట్టుబడ్డ ఓ ఎస్పీని వదిలి, కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం, అక్రమార్కులనే ఎర్రచందనం అక్రవరవాణా నియంత్రణకు నియమించడం గమనిస్తే బాబుకు స్మగ్లర్ల నియంత్రణపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థమవుతుందని భూమన అన్నారు. దీనిపై సి ఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.