ఆంధ్రప్రదేశ్
4 వేల మీటర్ల జాతీయ జెండా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 January 2017
రాజమహేంద్రవరం, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నాలుగు వేల మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండా రెపరెపలాడింది. నాలుగో డివిజన్ కార్పొరేటర్ బొంతా శ్రీహరి ఆధ్వర్యంలో ఈ భారీ పతాకాన్ని రూపొందించారు. వేలాది మంది విద్యార్థులు ఈ పతాకాన్ని చేతబూని జరిపిన ప్రదర్శనను రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. ర్యాలీకి ముందు వరుసలో సన్రైజింగ్రైడర్స్ సభ్యులు బుల్లెట్లతో ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్, వైసిపి నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, రాజా, ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్, రౌతు సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. పతాక రూపకర్త శ్రీహరిని సత్కరించారు.