ఆంధ్రప్రదేశ్‌

వద్దిపర్తిపై పోలీసులకు పురోహితుల ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 27: ఆధ్యాత్మిక ప్రసంగీకుడు వద్దిపర్తి పద్మాకర్‌పై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పురోహితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఒక ప్రైవేటు ఛానల్‌లో వద్దిపర్తి పద్మాకర్ పురాణ ప్రసంగం చేస్తూ ఏలూరు పురోహితులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ప్రైవేటు ఛానల్‌లో శివపురాణ ప్రసంగం చేస్తూ పురోహిత బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. నందీశ్వరుడు దక్షప్రజాపతికి ఇచ్చిన శాపంలో నిన్ను అర్చించినవారు, నీకు సహయపడినవారు పురోహితులై దరిద్రాన్ని అనుభవిస్తూ ఏలూరు వసంతమహల్ వంతెనపై కూర్చొని మందుతాగుతూ, తందనాలు ఆడుతూ, సిగరెట్లు తాగుతూ భ్రష్టులైపోతారని శివపురాణంలో లేని విషయాలను కల్పించి ప్రసంగించారని పేర్కొన్నారు. ఏలూరు వసంతమహల్ వంతెన కేంద్రంగా పౌరోహిత్యం చేసుకుంటున్న పురోహితులను కించపరిచారని, ఈప్రసంగంతో తామంతా మనస్తాపం చెందారని పేర్కొన్నారు. ఈప్రసంగానికి సంబంధించిన వీడియో సిడీలను కూడా వారు ఫిర్యాదుతో జతపర్చారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.