ఆంధ్రప్రదేశ్‌

నేడు జాతీయ కార్టింగ్ ఫైనల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 29: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న జాతీయ కార్టింగ్ ఛాంపియన్‌షిప్-2017 పోటీలు ఆదివారం ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఫైనల్స్‌లో కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ విశ్వవిద్యాలయాల జట్లు పోటీ పడ్డాయి. నిర్ణీత కాలంలో వేగంగా కార్టింగ్‌ను నడపాలి. తక్కువ సమయంలో ట్రాక్‌ను పూర్తిచేసిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఫైనల్స్ తొలి రౌండ్‌ను పూర్తిచేసుకున్న వారు ఫైనల్స్-2లో కూడా పోటీపడాలివుంది. సోమవారం 5 కిలోమీటర్లు ట్రాక్‌పై వీరంతా పోటీపడనున్నారు. తక్కువ సమయంలో ట్రాక్‌ను పూర్తిచేసుకున్న తర్వాత విజేతను ప్రకటిస్తారు. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాల గత మూడు రోజులుగా ఈ పోటీలు నిర్వహిస్తోంది.