ఆంధ్రప్రదేశ్‌

ఎంఇఓల భర్తీకి స్పెషల్ రూల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మండల విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో 10,11 లను విడుదల చేసినట్టు యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డిలు తెలిపారు. రూరల్ మండల విద్యాశాఖాధికారులుగా జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులను, అర్బన్ మండల విద్యాశాఖాధికారులుగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను నియమించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేళ్లు ప్రధానోపాధ్యాయుడిగా సర్వీసు కలిగి ఉండి 2017 మే 1వ తేదీ నాటికి 55 ఏళ్ల వయస్సున్న వారు ఎంఇఓలుగా నియామకానికి అర్హులవుతారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్‌లోని రూల్ -22 ప్రకారం రిజర్వేషన్లు అమలు అవుతాయని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.