ఆంధ్రప్రదేశ్
సిఎం వద్దకు చేరిన అర్చకుల ఫైల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 3 February 2017
హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఎపిలో అర్చకుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండురోజుల్లో ముఖ్యమంత్రి సంతకం అయ్యే అవకాశాలుంటాయని తెలిసింది. ముఖ్యమంత్రి సంతకం కాగానే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతాయి. సర్వీసు నిబంధనల కోసం చాలా సంవత్సరాల నుండి అర్చకులు వేచి చూస్తున్నారు. అర్చకుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని దేవాలయ పరిరక్షణ ఉద్యమం కన్వీనర్ సి.ఎస్. రంగరాజన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.