ఆంధ్రప్రదేశ్‌

ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో కేంద్ర కార్మికశాఖ నిర్మిస్తున్న 500 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిలోనే మెడికల్ కాలేజీని కుడా ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) చైర్మన్ జయశ్రీ మెహతను కలిసిన మంత్రి కామినేని నీట్-2017 ప్రవేశ పరీక్షలో పీజీ విద్యార్థులకు అర్హత మార్కులను తగ్గించాలని కోరారు. కడప ఫాతిమా మెడికల్ కాలేజీ 2015-16 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్ధులకు న్యాయం చేయాలని ఎంసీఐ చైర్మన్ జయశ్రీ మెహతకు మంత్రి కామినేని విజ్ఞప్తి చేశారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కాళాశాలలో కంటి విభాగంలో అదనంగా డిప్లోమా కోర్సు ఏర్పాటుకు ఎంసీఐ అంగీకరించినందుకు మెహతకు కామినేని కృతజ్ఞతలు తెలిపారు.