ఆంధ్రప్రదేశ్‌

నేడు పీలేరు కోర్టుకు క్రిమినల్ మధుకర్‌రెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఫిబ్రవరి 5: వరుస హత్యలు, దోపిడీలకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మధుకర్‌రెడ్డిని సోమవారం పీలేరు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సమాచారం. 2013లో బెంగళూరు నగరంలో ఎటిఎం నుంచి డబ్బు డ్రా చేస్తున్న ఓ మహిళపై కత్తితో దాడి చేసి డబ్బు కాజేసిన కేసులో మధుకర్‌రెడ్డి నిందితుడు. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న ఇతన్ని ఇటీవల మదనపల్లెలో జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈనేపథ్యంలో పోలీసు విచారణలో మూడు రాష్ట్రాల్లో నాలుగు హత్యలు, పలు దోపిడీ ఘటనల్లో పాలుపంచుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 2014లో పీలేరులో ఒంటరిగా ఇంటిలో ఉన్న మహిళను హత్య చేసి బంగారు నగలు, నగదుతో పరారైన కేసులో మధుకర్‌రెడ్డి నిందితుడు. ఈ కేసు నిమిత్తం సోమవారం ఇతన్ని పీలేరు కోర్టులో హాజరుపరచి అనంతరం వారెంట్‌తో తమ కస్టడీకి తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు.