ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా కోసం 9 నుంచి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6: రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా సాధించడానికి అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఐక్య ఉద్యమానికి ఏకతాటిపైకి రావాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు కోరారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ఎవరిదారి వారిదే అయితే పాలకులు పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. వైసిపి, వామపక్షాలు, జనసేన, అమ్ ఆద్మీ తదితర అన్ని పార్టీలు, సంస్థలు ఏకమైన ఉద్యమించాలన్నారు. అవసరమైతే తాను తప్పుకుంటానని, వేరొకరికి బాధ్యతలు అప్పగించి ఉద్యమాన్ని ముందుకు నడిపించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్‌లో సోమవారం సాయంత్రం అయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖలో నిరసన శిబిరం కోసం గత నెల 26 నుంచి మూడు రోజులు మినహా ఏ రోజైనా అనుమతి ఇస్తానని చెప్పిన డిజిపి ఇపుడు అనుమతి నిరాకరిస్తున్నారని, ఆయన మాటకే విశ్వసనీయత లేకపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలని చలసాని ప్రశ్నించారు. బీచ్‌రోడ్డులో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి మేనల్లునితో కలిసి రిలే దీక్షలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు 9వ తేదీ నుంచి రిలే దీక్షలు చేపడతామన్నారు. నిజమైన తెలుగు వాళ్లయితే అన్ని పార్టీలు హోదా, ప్రత్యేక ప్యాకేజీలు, విభజన హామీలను సాధించడానికి చేసే ఉద్యమంలో ముందుండాలని కోరుతున్నామన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి 15 రోజుల్లో కేబినెట్ ఆమోదంతో చట్టబద్ధత సాధిస్తామనడం చాలా సంతోషమని, అయితే ఇది దేనికోసమో అర్ధం కావడం లేదన్నారు. పోలవరం చట్టం ప్రకారం నూటికి నూరు శాతం నిధులు ఇవ్వాలని ఉందని, అయితే 16వేల కోట్లకు అంగీకరిస్తే ఆఖరికి విడుదలయ్యేది కేవలం రూ.3వేల కోట్లేనని, దీనికి చట్టబద్ధత సాధిస్తారా అని ప్రశ్నించారు. చట్టబద్ధత అంటూ చాలా దుర్మార్గానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టబద్ధంగా వచ్చే నిధులను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా వుందని ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలకు రూ.50 కోట్లతోనే సరిపెట్టడం ఎంతవరకు సమంజమో ఆలోచించాలన్నారు. హోదా అడిగినవాళ్ళంతా అజ్ఞానులా పది సంవత్సరాలని ఒకరు, పదిహేను సంవత్సరాలొకరు అన్నవాళ్ళంతా అజ్ఞానులేనా అని ప్రశ్నించారు.