ఆంధ్రప్రదేశ్‌

మూడురోజుల్లో విస్తరణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 7: ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు కానుంది. ఈనెల 9,10,11వ తేదీల్లో విస్తరణకు ముహుర్తంగా నిర్ణయించినట్టు సమాచారం. ఆ మేరకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల గవర్నర్‌ను కలిసిన సందర్భంలో తన మనసులోమాట బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఏదైనా కారణాల వల్ల వాయిదా పడితే 16వ తేదీలోగా విస్తరణ చేపట్టడం ఖాయమంటున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మరో మూడు, నాలుగురోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవటం ఖాయమైంది. అసలు ఆయన కోసమే విస్తరణ చేపట్టనున్నారు. ఇక తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుకూ మంత్రివర్గంలో స్థానం దక్కనుంది. ఆయన మరదలు, ప్రస్తుత మంత్రి మృణాళినిని తొలగించి, ఆమె స్థానంలో కళాను తీసుకోనున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న నిమ్మకాయల చిన రాజప్పను తొలగించి, కళా వెంకట్రావు స్థానంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించవచ్చంటున్నారు. చినరాజప్ప స్థానంలో అదే జిల్లాకు చెందిన కాపునేత జ్యోతుల నెహ్రుకు ఇవ్వవచ్చంటున్నారు. జగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు రెడ్డి సామాజికవర్గానికి ఈసారి ప్రాధాన్యం లభించనుంది. అందులో భాగంగా, పదేళ్లు ప్రతిపక్షంలో వైఎస్ పైనా, గత రెండున్నరేళ్ల నుంచి జగన్‌పై విమర్శల దాడి చేస్తున్న సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి క్యాబినెట్‌లో అవకాశం దక్కనుంది.
అదే నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి నారాయణను తొలగించి, సీఆర్‌డీఏకు చైర్మన్‌గా నియమించవచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, వైసీపీ నుంచి పార్టీలో చేరిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలా? వద్దా అన్న మీమాంస కొనసాగుతోంది. మాట ఇచ్చినందున దానిని నిలబెట్టుకోవాలని భావిస్తే మాత్రం ఆ కోటా నుంచి రెడ్డి వర్గంలో భూమా అఖిలప్రియకు అవకాశం దక్కవచ్చు. చిత్తూరు జిల్లా నుంచి అమర్‌నాథ్‌రెడ్డికి కూడా అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుత ప్రస్తుత మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాధరెడ్డిలను కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అనంతపురం జిల్లా నుంచి చాంద్‌షాషాకు పదవిపై చర్చ జరుగుతోంది. మైనారిటీలకు అవకాశం ఇచ్చే సందర్భంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత, బాబుకు అత్యంత విధేయుడైన ఎం.ఏ.షరీఫ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిశోర్‌బాబుపై వేటు ఖాయమంటున్నారు. ఆయన చర్యలతో పార్టీ ఇప్పటికే భ్రష్ఠుపట్టిపోయిందన్న ఆగ్రహం నాయకత్వంలో ఉంది. ఆయనను తొలగిస్తే మాదిగ సామాజికవర్గం నుంచి ఎవరూ లేనందున, ఆయన స్థానంలో కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత వర్ల రామయ్యను తీసుకుని, తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారా చూడాల్సి ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావు కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలతో పార్టీ నష్టపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన తొలగింపుపై ఫిఫ్టీ-్ఫఫ్టీ అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ ఆయనను తొలగిస్తే, అదే సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చాన్స్ దక్కవచ్చంటున్నారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత కొనసాగింపు ఫిఫ్టీ-్ఫఫ్టీగానే ఉంది. ఆమెపైనా అనేక ఆరోపణలున్నప్పటికీ, శాఖ మారుస్తారే తప్ప పదవి నుంచి తప్పించరని కొందరు, ఆమె స్థానంలో అదే సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం ఇస్తారని మరికొందరు చెబుతున్నారు. అదే జరిగితే విశాఖ జిల్లా నుంచి దళిత ఎమ్మెల్యే అనితకు అవకాశం లభించవచ్చని, మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఈసారి ప్రాధాన్యం తగ్గించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాపులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ బీసీల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో, వారిని సంతృప్తిపరిచేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శెట్టిబలిజకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పీతాని సత్యనారాయణకు అవకాశం లభించవచ్చు. అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర కొనసాగింపు పైనా ఫిఫ్ట్ఫీఫ్టీ అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ ఆయనను తొలగిస్తే అదే వర్గానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత కొండబాబుకు అవకాశం దక్కవచ్చు. ఇక మంత్రివర్గంలో యనమల ఒక్కరే యాదవుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్నందున, జనాభా అధికంగా ఉన్నందున మరోయాదవకు చాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేవంటున్నారు. రాయలసీమ చుట్టూ ఉన్న ఆరు జిల్లాల్లో ఇప్పటివరకూ కెఇ కృష్ణమూర్తి ఒక్కరే బీసీ కోటాలో ఉన్నందున, నెల్లూరు జిల్లా నుంచి యువనేత, జిల్లా పార్టీ అధ్యక్షుడైన బీదా రవిచంద్రకు యాదవ కోటాలో అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదంటున్నారు. విజయనగరం నుంచి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు అవకాశం దక్కవచ్చంటున్నారు. ఉప ముఖ్యమంత్రి కెఇ శాఖ మార్చవచ్చంటున్నారు.

చిత్రాలు..నారా లోకేష్, సోమిరెడ్డి