ఆంధ్రప్రదేశ్‌

పలాస-కాశీబుగ్గలో ఐటి విస్తృత దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, ఫిబ్రవరి 7: గత ఏడాది నవంబర్ 8 నుంచి పెద్దనోట్ల రద్దు అనంతరం జరిపిన ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో మంగళవారం ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పలువురు వ్యాపారులు, డాక్టర్లు జరిపిన లావాదేవీలపై ఆరా తీసేందుకు ఈ ఐటి దాడులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. సోదాలు చేయడంతో బంగారం దుకాణాలు, జీడి పరిశ్రమలు, ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడ్డాయి. ఐటి కమిషనర్ ఓంకారేశ్వర్ ఆదేశాల మేరకు సుమారు 80 మంది అధికారులు 15 బృందాలుగా విడిపోయి సిందిరి సతీష్, త్రిబుల్ ఎస్ సంతోష్, టి.రవిశంకర్‌గుప్తా, మల్లా కాంతారావుకు చెందిన పరిశ్రమలు, ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మరికొన్ని బృందాలు జంట పట్టణాల్లోని డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ దంతం బీమారావు, మరికొన్ని ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించారు. ఐటి అధికారులు ఆసుపత్రి వద్దకు వచ్చి రోగుల మాదిరిగా పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వారి వద్ద వున్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జీడిపరిశ్రమల్లో ఉన్న ప్రతి కాగితాన్ని పరిశీలించి ఇటీవల జరిపిన క్రయవిక్రయాలు, లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో పలువురు వ్యాపారులు, డాక్టర్లు తమ సముదాయాలను మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఐటి అధికారులు మాత్రం వారికి వున్న ముందస్తు సమాచారం మేరకు ఆయా ప్రాంతాలకు వెళ్లి సోదాలు నిర్వహించారు.