ఆంధ్రప్రదేశ్‌

అలిపిరి వద్ద వ్యక్తి దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 9: తిరుపతి నగరంలో అలిపిరి సమీపంలో స్థానిక పాత చెక్‌పోస్టు వద్ద తమిళనాడుకు చెందిన చంద్ర వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం తెల్లవారు జామున హత్య చేశారు. దుండగులు కర్రతో మోది దారుణంగా చంపేశారు. సమాచారం తెలుసుకున్న అలిపిరి సి ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చంద్ర తమిళనాడు అరక్కోణం రైల్వేస్టేషన్లో ఒక బ్యాగ్‌ను దొం గతనం చేసి తీసుకువచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈక్రమంలో చంద్ర తిరుపతిలో హత్యకు గురికావడం పలురకాల అనుమానాలకు తావిస్తోంది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సి ఐ శ్రీనివాసులు తెలిపారు. మృత దేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.