ఆంధ్రప్రదేశ్‌

18న విశాఖలో లోక్‌సత్తా వౌనదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (జగదాంబ) ఫిబ్రవరి 9: ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్నివిధాలా జరుగుతున్న అన్యాయంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ ఈ నెల 18న విశాఖలో లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు వౌనదీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. విశాఖలో గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ ప్రతిపాదనలు అనే పేరుతో శ్రీకాకుళం జిల్లాకు 12 అంశాలు, విజయనగరానికి పది అంశాలు, విశాఖకు 13 అంశాలు ప్రకటించి నేటికి మూడేళ్ళు కావస్తున్నా సమస్యలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఉత్తరాంధ్రలోనే ఉన్న అనేక పరిశ్రమలు మూతపడినా నేటికి వాటిని తెరిచే ప్రయత్నం ప్రభుత్వం చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఉత్తరాంధ్రలో వ్యవసాయ, ఉపాధి లేక ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో చివరికి మానవ అభివృద్ధి సూచికలో వెనుకబడి ఉన్నామని, చంద్రబాబు, వెంకయ్యనాయుడులు ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన సాగిస్తున్నారన్నారు.