ఆంధ్రప్రదేశ్‌

అత్యద్భుతంగా అల్లూరి మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : విశాఖలో నిర్మించ తలపెట్టిన అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రైబల్ మ్యూజియానికి కోల్‌కత్తాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ నితీష్‌రాయ్ డిజైన్లు రూపొందించారు. ఈ నెలలో డిజైన్లకు ఆమోదం తెలిపి వచ్చే ఏడాది అక్టోబర్ 30 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. అత్యద్భుతంగా నిర్మించే ఈ మ్యూజియానికి సుమారు రూ.50 కోట్ల వ్యయం కానుందని అంచనా. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అరకులో క్రీడా పాఠశాల త్వరలోనే ఏర్పాటు కానుంది. సమావేశంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న, సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..అల్లూరి స్మారక గిరిజన మ్యూజియం నమూనా