ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్ వర్గాలకు మోదీ వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 11: ప్రధాని మోదీ పేదల పక్షమంటూ కార్పొరేట్, ధనికవర్గాలకు వత్తాసు పలుకుతున్నారని, వాగాడంబరంతో దేశ ప్రజలను మోసం చేస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం అనంతపురం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రధాని వైఖరి తేటతెల్లమైందన్నారు. పేద ప్రజల అభ్యున్నతి, సంక్షేమానికి నిధుల కేటాయింపులు తగ్గిపోతున్నాయన్నారు. అసంఘటిత కూలీలకు ఉపాధి కల్పించే ఎన్‌ఆర్‌ఈజిపికి గతంలో కంటే 0.9 శాతం నిధులు పెంచి పెద్దఎత్తున నిధులు కేటాయించామని ఆర్థికమంత్రి జైట్లీ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. కరవు పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతులు కుటుంబాలకు ఉపశమనం కలిగించే చర్యలు బడ్జెట్‌లో లేవన్నారు. రైతు రుణాలపై కేవలం 2 నెలల వడ్డీ మాఫీ చేసి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు వినియోగదారులకు ఆ మేరకు లబ్దిచేకూర్చడం లేదన్నారు. కస్టమ్స్, అమ్మకం పన్ను విధించి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించిన కేంద్ర ఫ్రభుత్వం అన్ని వినిమయ వస్తువులపై సేవా పన్నును 12 నుండి 15.5 శాతానికి పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం మోపిందన్నారు.
మోదీ పాలనలో సంపద కొంతమంది చేతుల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమవుతోందన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని సురవరం ధ్వజమెత్తారు. నల్లధనం వెలికితతకు నోట్లు రద్దు చేశామని చెప్పిన ప్రధాని రూ.2 వేల నోటు ముద్రణపై నోరు మెదపడం లేదన్నారు. పెద్దనోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి డిసెంబర్ 31తో గడువు ముగిసినా నేటికీ బ్యాంకుల్లో ఎంత డబ్బు జమ అయింది చెప్పడం లేదన్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రధాని స్థాయికి తగినట్లు కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను అపహాస్యం చేస్తూ దిగజారి మాట్లాడారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతున్న చంద్రబాబు కూడా ముగిసిన అధ్యాయమేనని పేర్కొన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రధాని మోదీ నిరాకరించడంతో హోదా ఉద్యమాన్ని నీరుగార్చడానికి 14వ ఆర్థిక సంఘం చెప్పిందిని అబద్దపు ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళనాడు రాజకీయాలపై స్పందిస్తూ అన్నాడిఎంఎకెలో చీలిక తెచ్చి అనిశ్చిత పరిస్థితి తీసుకువచ్చి తమకు అనుకూలమైన వారికి సిఎం పదవి కట్టబెట్టాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. అలా కుదరకపోతే రాష్టప్రతి పాలన విధించాలని ప్రయత్నిస్తోందన్నారు. తమిళనాడులో ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ పిజె.చంద్రశేఖర్‌రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, ఎంవి.రమణ, జాఫర్, పి.నారాయణస్వామి, వేమయ్యయాదవ్, రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విలేఖరులతో మాట్లాడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి