ఆంధ్రప్రదేశ్
బాబు, కెసిఆర్ దొందూ దొందే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 February 2017
ఖమ్మం, ఫిబ్రవరి 13: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుచరులుగా వ్యవహరిస్తూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని, కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అందరికంటే ముందు బలపర్చడం వీరివంతని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. ఖమ్మంలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ ఉద్యమం పేరుతో ప్రజలను కదిలించిన కెసిఆర్కు నాటి ఉద్యమ ద్రోహులే నేటి మిత్రులయ్యారని, అందులో తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతలు ముందు వరుసలో ఉన్నారన్నారు. తుమ్మల, తలసాని లాంటి వారు తెలంగాణను వ్యతిరేకిస్తే వారికి మంత్రి పదవులను కట్టబెట్టటం ఏమిటని ప్రశ్నించారు.