ఆంధ్రప్రదేశ్‌

నక్కపల్లి బాధితులకు సిఎం పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సమీపంలోని వెదుళ్లపాలెం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పరామర్శించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన బుచ్చిరాజుపాలెంలోని బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకుని ఓదార్చారు. జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రెండేసి లక్షల రూపాయల వంతున రూ.18 లక్షల చెక్కు అందజేశారు. ఆయన వెంట పంచాయతీరాజ్‌శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పిజివిఆర్ నాయుడు(గణబాబు) తెలుగుదేశం నాయకులు ఉన్నారు.

చిత్రంమృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తున్న ముఖ్యమంత్రి