ఆంధ్రప్రదేశ్
ఎటిఎం దగ్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 16 February 2017
గోపాలపట్నం (విశాఖపట్నం), ఫిబ్రవరి 15 : ఇక్కడి ఎన్ఎడి కూడలిలోని స్టేట్బ్యాంక్ ఆఫ్ పాటియాలా ఎటిఎంలో మంటలు చెలరేగి ఎటిఎం మిషన్, అందులోని కరెన్సీ 20 లక్షలు, బ్యాంకుకు చెందిన సుమారు రూ. 30 లక్షల విలువ చేసే ఆస్తి కలిపి మొత్తం 50 లక్షల వరకు బుగ్గిపాలయ్యాయి. మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీవల్లీ కాంప్లెక్సులో ఉన్న ఎటిఎంలో మంటలు చెలరేగడంతో కాంప్లెక్సులోని ఇతర దుకాణాల్లోని సిబ్బంది భయంతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. కాగా బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని అన్నారు. అయినప్పటికీ బ్యాంకు ఉన్నతాధికారులు వచ్చి పరిశీలిస్తారని అన్నారు.