ఆంధ్రప్రదేశ్‌

చెరువులోపడి ఇద్దరు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 17: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు చెరువులో పడి మృతిచెందిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం చోటుచేసుకుంది. కాకినాడ వన్‌టౌన్ సిఐ ఎఎస్ రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక అన్నమ్మఘాటి ప్రాంతంలో నివాసం ఉంటున్న మందపల్లి వీర్రాజు అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం ఒక శుభకార్యం జరిగింది. దీనికి స్థానికంగా నివాసం ఉంటున్న దడాల సునీల్, పిఠాపురంనకు చెందిన మందపల్లి శ్రీనివాస్ తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అందరూ వేడుకల్లో నిమగ్నమైవున్న సమయంలో సునీల్ కుమార్తె ధరణి(5), శ్రీనివాస్ కుమార్తె మైత్రి(3) ఇంటి ఎదుట ఉన్న చెరువువద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. ఆ చెరువు గట్టుకు రక్షణ గోడ లేకపోవడంతో ఆడుకుంటున్న ధరణి, మైత్రి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. సాయంత్రం 4గంటల సమయంలో బాలికలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, చెరువులో వారి దేహాలు తేలుతూ కనిపించాయి. చెరువు నుండి వెలికితీసి హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. వన్‌టౌన్ సిఐ ఎఎస్ రావు హుటాహుటిన చెరువు ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యుల నుండి వివరాలను అడిగితెలుసుకున్నారు. శనివారం పోస్టుమార్టం నిర్వహిస్తామని, కేసు నమోదుచేసి, దర్యాప్తుచేస్తున్నామని సిఐ రావు తెలిపారు.

చిత్రం..మైత్రి, ధరణి మృత దేహాలు