ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీకి 34 మంది నామినేషన్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 February 2017
విశాఖపట్నం, ఫిబ్రవరి 20: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి 34 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం మొదలైనప్పటి నుంచి శనివారం వరకూ 21 మంది నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు సోమవారం 13 మంది తమ నామినేషన్ పత్రాలను సహాయ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ స్థానం నుంచి పిడిఎఫ్ అభ్యర్థి ఎంవిఎస్ శర్మ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా, ఇదే పార్టీ తరపున కార్మిక నేత అజశర్మ పోటీ చేస్తున్నారు. టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా పివిఎన్ మాధవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా యడ్ల ఆదిరాజు సహా మిగిలిన వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు నామినేషన్లు దాఖలు చేశారు.