ఆంధ్రప్రదేశ్‌

‘బ్రాహ్మణ బంధు’ చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పని చేసే అర్చకులకు వారసత్వ హక్కును కల్పించి, వారి వయోపరిమితిని రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపి అర్చక సమాఖ్య కొనియాడింది. దీనిపై జీవో జారీ చేయడం చారిత్రకమని పేర్కొంటూ, 30 ఏళ్ళుగా పోరాడుతున్న తమకు న్యాయం చేసినందుకు అర్చక సమాఖ్య ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ‘బ్రాహ్మణ బంధు’ అనే బిరుదుతో గౌరవించుకుంటామని తెలిపారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అర్చక సమాఖ్య ప్రతినిధులు వారసత్వ హక్కుతో హిందూ ధర్మాన్ని పరిరక్షించడమే కాకుండా 40వేల పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకున్నారంటూ ఆయనకు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనం అందించారు. ఇక నుంచి ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యుల పేరున రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రతినిత్యం అర్చన జరపాలని నిర్ణయించినట్టు తెలిపారు. 1997లో దేవాదాయ శాఖ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడిన ఘనత కూడా చంద్రబాబుదేనని అర్చక సమాఖ్య ప్రతినిధులు అన్నారు. పేద బ్రహ్మణులు ఇల్లు కట్టుకునేందుకు, ఉపనయనానికి, వైద్యానికి ఇలా అన్ని విధాలా సాయం చేస్తూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, ఇందుకు సర్వదా రుణపడి వుంటామని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో పేదరిక నిర్మూలన కోసమే దేశంలో ఎక్కడా లేనట్టుగా రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అర్చక ప్రతినిధులకు గుర్తు చేశారు. అందరి మత విశ్వాసాలను తాను గౌరవిస్తానని, ప్రతి ఒక్కరు పరమత సహనం పాటించాలని చెప్పారు. దైవ చింతనతో మనలో అంతఃశక్తి పెంపొందుతుందని, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని అన్నారు. బ్రాహ్మణులకు తమ ప్రభుత్వం నుంచి నిరంతరం చేయూత ఉంటుందని, మిగిలిన సమస్యలు పరిష్కరిస్తామని అర్చక సమాఖ్య ప్రతినిధులకు హామీ ఇచ్చారు.