ఆంధ్రప్రదేశ్‌

శరవేగంగా ‘చంద్రన్న బాట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 21: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన చంద్రన్న బాట నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ సిసి రోడ్లు నిర్మించాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుంటూ వాడవాడలా చంద్రన్నబాట కార్యక్రమాన్ని చేపట్టింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5,170 కిలోమీటర్ల పైబడి గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అధికారులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తోంది. ఇప్పటివరకూ రాష్టవ్య్రాప్తంగానున్న 13 జిల్లాల్లో ఉన్న 13వేల పంచాయతీల్లో 4,119 కిలోమీటర్ల పైబడి రోడ్లు నిర్మించారు. గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా సిమెంట్ రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16లో 3,043 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను లక్ష్యంగా పెట్టుకోగా, 4,111 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించారు. లక్ష్యానికి మించి రోడ్లు నిర్మించారు. ఈ ఏడాది కూడా లక్ష్యానికి మించి సిమెంట్ రోడ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ భావన. దీని కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గనిర్దేశకం చేస్తోంది. దేశ ప్రగతికి పట్టుగొమ్మలన్న బాపూజీ మాటలను నిజం చేస్తూ సిఎం చంద్రబాబునాయుడు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. సిమెంట్ రహదారుల నిర్మాణంతో గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రూపు తీసుకొస్తోంది. అన్ని గ్రామాల్లోనూ వాడవాడలా చంద్రన్నబాటలో సిమెంట్ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం 2016-17లో రూ.2వేల కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణాల్లో మూడు జిల్లాలు శత శతానికి చేరువగా నిలిచాయి. నెల్లూరు జిల్లాలో 99 శాతం మేర చంద్రన్న బాట నిర్మాణాలు పూర్తయ్యాయి. పశ్చిమగోదావరిలో 97 శాతం, గుంటూరులో 95 శాతం మేర సిమెంట్ రహదారుల నిర్మాణాలు పూర్తిచేశారు. రాష్ట్రంలో ఉన్న 13వేల పంచాయతీల్లో సిసి రోడ్ల నిర్మాణాలు సాగుతున్న తీరు పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 436 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. ఇప్పటివరకూ 345 కిమీలు నిర్మించారు. చిత్తూరులో 203, తూర్పుగోదావరిలో 420 కిమీ మేర సిమెంట్ రోడ్లు నిర్మించారు. గుంటూరులో 312, కడపలో 266 కిమీ, కృష్ణాలో 248 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు నిర్మించారు.