ఆంధ్రప్రదేశ్‌

భీమిలి తాసీల్దార్‌కు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగంపై ఎసిబి అధికారులు బుధవారం జరిపిన దాడుల్లో ఐదు కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టిన భీమిలి తహశీల్దార్ రామారావును అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకూ రామారావుకు రిమాం డ్ విధించారు. రామారావు ఆస్తులపై బుధవారం అర్థరాత్రి దాటే వరకూ ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. లాకర్లలో దాచిన బంగారం, నగదు అనూహ్యంగా బయటపడింది. మొత్తంమీద 2.9 కిలోల బంగారాన్ని, సుమారు 42 లక్షల రూపాయల నగదును ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి సుమారు ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఉన్నట్టు ఏసిబి అధికారులు కనుగొన్నారు. రామారావు అక్రమార్జన మాత్రం మార్కెట్ విలువనుబట్టి 50 కోట్ల పైమాటేనని తెలుస్తోంది.