ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఫిబ్రవరి 26: కారు, మినీ లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి గ్రామ సమీపాన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండల తహశీల్దార్ రమణరావు భార్య బత్తుల మాధవి, ఆమె సోదరుడు రఘురాం గ్రూప్-2 పరీక్ష రాయడానికి శనివారం రాత్రి మార్కాపురం చేరుకున్నారు. ఆదివారం పరీక్ష ముగిసిన అనంతరం స్వగ్రామం వెళ్లేందుకు మార్కాపురం నుంచి అద్దె కారులో వెళ్తుండగా తర్లుపాడు మండలం మేకలవారిపల్లి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న మినీలారీ ఢీకొని అన్నాచెల్లెలు రఘురాం, మాధవితోపాటు మినీలారీ డ్రైవర్ కోలగట్ల అంబిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు.

బళ్లారిలో ఐదుగురి దారుణహత్య
బళ్లారి, ఫిబ్రవరి 26: కుటుంబ కలహాల కారణంగా భార్యతో పాటు కోడలు, ముగ్గురు కుమార్తెలను దారుణంగా హత్య చేసిన సంఘటన శనివారం కర్నాటకలోని బళ్లారి జిల్లా కంప్లి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కంప్లి పట్టణంలోని 3వ వార్డు చప్పరహళ్లి వీధిలో నివాసం ఉండే తిప్పయ్య కుటుంబ కలహాల కారణంగా భార్య పక్కీరమ్మ(36), కోడలు గంగమ్మ(30), కుమార్తెలు బసమ్మ(10), రాజీ(8), పవిత్ర(16)లను కొడవలితో విచక్షణారహితంగా నరికాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పవిత్ర ఆసుపత్రిలో మృతిచెందింది. హత్య చేసిన అనంతరం నిందితుడు తిప్పయ్య కంప్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.

కొబ్బరి తోటలో విషపుటీగల దాడి
ప.గో.లో ఒకరు మృతి
మొగల్తూరు, ఫిబ్రవరి 26: కొబ్బరి కాయలు తీస్తున్న సమయంలో విషపుటీగలు జరిపిన దాడిలో ఒక వ్యక్తి మృతిచెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నార్త్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పేరుపాలెం నార్త్ గ్రామానికి చెందిన అందే రాంబాబు తన సొంత కొబ్బరి తోటలో కొబ్బరి కాయలు తీయడానికి గీత కార్మికులతో కలిసి వెళ్లాడు. కొబ్బరి కాయలు తీస్తున్న సమయంలో ఒక కొబ్బరి చెట్టుకున్న విషపుటీగల పుట్ట చెదిరింది. ఒక్కసారిగా చెలరేగిన విషపుటీగలు అక్కడవున్న రాంబాబు (55) పై దాడిచేసి, విపరీతంగా కుట్టాయి. దీనితో తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని నరసాపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.