ఆంధ్రప్రదేశ్‌

ఆది దంపతుల గిరి ప్రదక్షిణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 28: నూతన వధూవరులైన ఆది దంపతులు మంగళవారం కైలాసగిరి ప్రదక్షిణ చేసి అతిథులకు సంప్రదాయ రీతిలో వీడ్కోలు పలికారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు, కల్యాణోత్సవానికి విచ్చేసిన రుషులను, మునులను వారి వారి స్వస్థలాలకు చేర్చే ఉత్సవాన్ని రుషిరాత్రి అంటారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ కాళహస్తీశ్వరాలయానికి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను గిరి ప్రదక్షిణకు తీసుకెళ్లారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చిన అతిథులకు వీడ్కోలు పలకడానికే ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయం ఉన్న కైలాసగిరి పర్వతాన్ని చుట్టిరావడాన్ని ఈ ఉత్సవం ప్రత్యేకత. పార్వతీపరమేశ్వరుల వెంట భక్తులు అధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.