కృష్ణ

ఐసిస్ బాధితుడు రామ్మూర్తికి సిఎం ఆర్థిక సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 2: లిబియాలో ఐసిస్ తీవ్రవాదుల చేతుల్లో కిడ్నాప్‌నకు గురై, గాయపడిన ఏలూరు వాసి డాక్టర్ కోసనం రామ్మూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. అంతేకాకుండా ఆయన కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని, కుమార్తె, కుమారుడికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. లిబియాలో ఐసిస్ తీవ్రవాదులు 10 నెలల పాటు రామ్మూర్తిని బంధించి, బలవంతంగా ఆపరేషన్లు చేయించారు. ఐసిస్ దాడిలో రామ్మూర్తికి ఎడమ భుజం దెబ్బతింది. దాంతో తమను ఆదుకోవాలని రామ్మూర్తి కుటుంబం గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, ఆదుకోవాలని కోరింది. రామ్మూర్తి కుటుంబ పరిస్థితికి చలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరఫున సాయం ప్రకటించారు.

చిత్రం..రామ్మూర్తి కుటుంబం ఇచ్చిన వినతి పత్రం పరిశీస్తున్న ముఖ్యమంత్రి