ఆంధ్రప్రదేశ్‌

కూచిపూడి నృత్యరూపాల రచనలకు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 2: కూచిపూడి నృత్య నాటకాల ప్రదర్శనలకు అనువైన రచనలను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డి.విజయ్‌భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి నృత్య నాటకాల ప్రదర్శనల కోసం ఇప్పటివరకు కొనసాగుతున్న ప్రదర్శనలకు భిన్నంగా కొత్త కోణంలో రచనలను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. రచయితలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి సంబంధించి చరిత్రలో జరిగిన గొప్ప ప్రేమ కథలు, యుద్ధగాథలు, మానవ నాగరికతను మలుపు తిప్పిన ఆలోచనలు, హాస్యాభరితమైన ఇతివృత్తాంతాలు, పౌరాణిక, సాంఘిక, చారిత్రక అంశాలపై దృష్టి సారించి రచనలు చేయాలన్నారు. ఏప్రిల్ 30లోపు భాషా సాంస్కృతిక శాఖకు స్క్రిప్టులను పంపించాలని తెలిపారు. గుణ నిర్ణయానికి కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఒక్కో నాటకంలో 6 నుంచి 10 వరకు పాత్రలు ఉండాలని.. నాయక, నాయికి, ప్రతి నాయక ప్రవేశ దరువు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. అవకాశముంటే నాయికకు ‘లేఖ’ రచనా సన్నివేశం ఉండవచ్చని.. సంక్షిప్తమైన వచనాలు, చందోబద్ధమైన కందార్థం, సీసార్థంతోపాటు ఇతర వృత్తాలను వాడవచ్చని తెలిపారు. కాల పరిమితి 75-90 నిమిషాల మధ్య ఉండాలని.. స్వీయ రచనగా ధ్రువపత్రాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు. న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయమని.. రచనలు శిష్ట వ్యవహారికంలో ఉండాలని, అవసరమైన చోట మాండలీకాల్ని వాడవచ్చని చెప్పారు. పోటీలకు పంపించే రచనలు ఇప్పటివరకు ప్రదర్శించనివై ఉండాలని, ఉత్తమ కూచిపూడి నృత్య నాటకానికి గాను ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తామన్నారు. అర్హమైన వాటిని భాషా సంస్కృతిశాఖ ముద్రిస్తుందని, అటువంటి వాటికి తగిన పారితోషికం ఇస్తారని ప్రకటించారు. ఈ రచనలను ఎవరైనా ప్రదర్శించుకునే అవకాశాన్ని భాషా సాంస్కృతికశాఖ కల్పిస్తుంది.