ఆంధ్రప్రదేశ్‌

వరుస ప్రమాదాలపై ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 2: రాష్ట్రంలో వరుసగా బస్ ప్రమాదాలు జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ఉండవల్లిలో తన నివాసం నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగిన రోడ్లు ప్రమాదాలపై ఆరా తీశారు. కృష్ణా జిల్లాలో జరిగిన ప్రమాదం ఘటన మరువక ముందే రెండు ప్రమాదాలు చోటు చేసుకోవడంపై విచారణ జరిపి నివేదిక అందించాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘరరావులను ఆదేశించారు. రహదారుల మలుపుల వద్ద సైన్‌బోర్డులు ఏర్పాటు చేయని టోల్ గేట్ల యజమాన్యాలపై కూడా దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది. కాకినాడలో జరిగిన జంట హత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. శాంతి భద్రతలపై రాజీ పడరాదని డిజిపి నండూరి సాంబశివరావుకు సూచించారు. ముఖ్యమంత్రిని డిజిపి కలిసిన సందర్భంలో ఈఅంశం ప్రస్తావనకు రాగా.. ఘటనపై సీఎంకు డిజిపి వివరించారు.